ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుటుంబ సమేతంగా తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నసీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 14, 2018, 10:50 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మంత్రి నారా లోకేష్‌, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబసభ్యులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం నారావారిపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు రాత్రి అక్కడే బసచేశారు. ఈ రోజు ఉదయం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తిరుమల చేరుకుని వెంకన్నను దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com