చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 62వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 62వ రోజు పాదయాత్రను నెన్నూరు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర శెట్టివారిపల్లి క్రాస్, కట్టకింద వెంకటాపురం, వెంకటాపురం క్రాస్, చల్లావారిపల్లి, సొరకాయలపాలెం క్రాస్, మద్దూరుపల్లి, పులికుంట, కమ్మపల్లి క్రాస్, దేశూరి కండ్రిగ, రావిళ్లవారిపల్లి మీదుగా పారకాల్వ క్రాస్ వరకు కొనసాగనుంది.