చిత్తూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో శనివారం సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం సతీమణి నారా భువనేశ్వరితోపాటు కుటుంబ సభ్యులు పాల్గన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీటీడీ కల్యాణ మండపంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు నారా భువనేశ్వరి బహుమతులు అందజేశారు.