రాజస్థాన్ లోని జైపూర్ లో దారుణం జరిగింది. స్థానిక విద్యానగర్ లోని సెక్టార్-9 లో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇంట్లోని ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. సిలిండర్ పేలటంతో పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. దీంతో చుట్టు పక్కల వారు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. మంటలు మరింత వ్యాపించకుండా ఫైరింజన్లతో ద్వారా అదుపులోకి తెచ్చారు. సిలిండర్ ను సరిగా ఆఫ్ చేయకపోవటంతోనే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు.