ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి ఓ మూలస్తంభంగా ఉండాలి : మాజీ న్యాయశాఖ మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2018, 04:40 PM

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై మరో నలుగురు న్యాయమూర్తులు చేసిన ఫిర్యాదుపై మాజీ న్యాయశాఖ మంత్రి హన్సరాజ్ భరద్వాజ్ స్పందించారు. ఆ ఆరోపణలతో సర్వోన్నత న్యాయస్థానం తన గౌరవాన్ని కోల్పోయిందన్నారు. ఒకసారి ప్రజల విశ్వాసం సన్నగిల్లితే, ఇక అందులో ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి ఓ మూలస్తంభంగా ఉండాలని, అత్యున్నత న్యాయస్థానం ఎలా పనిచేస్తుందన్న అంశాన్ని చూసుకోవాల్సిన బాధ్యత న్యాయశాఖ మంత్రిదే అని హన్సరాజ్ ఆరోపించారు. అయితే జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలో ఇవాళ ముగ్గురు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్‌పై తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి విన్నవించేందుకు సీనియర్ కాంగ్రెస్ నేత, లాయర్ కపిల్ సిబల్ కలవనున్నారు. తమ ఆవేదన వెలిబుచ్చిన జస్టిస్ చలమేశ్వర్‌ను ఇవాళ సీపీఐ ఎంపీ డీ రాజా కలిశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com