ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎఫ్డిఐలను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయం బిజెపి విధానాలకు వ్యతిరేకమని ఆ పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. బిజెపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిటైల్ వ్యాపారంలో 100 శాతం ఎఫ్డిఐలను వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత సింగిల్ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో 100 శాతం ఎఫ్డిఐలను అనుమతించడంలో అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు.