సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థపై సర్వోన్నత న్యాయస్థానం సీనియర్ న్యాయమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రధాని నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. మోదీతో అత్యవసరంగా సమావేశం కావాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ను ప్రధాని కార్యాలయం కోరింది. ఈ సమావేశంలో తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. మరోవైపు న్యాయమూర్తుల సంచలన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా మధ్యాహ్నం 2 గంటలకు అటార్నీ జనరల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
న్యాయ చరిత్రలో తొలిసారి న్యాయమూర్తులు మీడియా ముందుకు వచ్చి సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థపై అసంతృప్తి వ్యక్తంచేశారు. సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.