న్యూఢిల్లి : ఆంధ్రప్రదేశ్కు ఇవ్వవలసిన రెవిన్యూ లోటును భర్తీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. తొలి ఏడాది రెవిన్యూ లోటు 16078.76 కోట్లు కాగా కేంద్రం 7500 కోట్లు భరిస్తానని భరోసా ఇచ్చిందని ఆయన చెప్పారు. అయితే తొలి ఏడాది కేంద్రం కేవలం 3979 కోట్లు మాత్రమే ఇచ్చిందని ఆయన అన్నారు.
మిగిలిన మొత్తాన్ని వెంటనే ఇవ్వాలని ఆయన కోరారు. దుగరాజపట్నం ప్రాజెక్టును పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. దుగరాజపట్నం నిలిపివేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. హామీ ప్రకారం దుగరాజపట్నం పూర్తి చేయాలని ఆయన కోరారు. కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్కు నిధులు మంజూరు చేయాలని కోరారు. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్కు 5615 కోట్ల రూపాయిలు కేంద్రమే అందించాలని ఆయన కోరారు.