న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో చలిగాలులు ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్డు, రైలు, విమాన సర్వీసులను అధికారులు రద్దు చేస్తున్నారు. శుక్రవారం కూడా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో శుక్రవారం మొత్తంగా 50 రైళ్లను ఆలస్యంగా నడపాలని అధికారులు నిర్ణయించారు. ఐదు రైళ్ల షెడ్యూళ్లను మార్చారు.