తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. ఏడుకొండలవాడి సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 51,127 మంది భక్తులు దర్శించుకున్నారు. 19,962 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2.79 కోట్లుగా ఉంది.