చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 59వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. జగన్ తన 59వ రోజు పాదయాత్రను గుండుపల్లి నుంచి ప్రారంభించారు. పాదయాత్ర వెదురుకుప్పం, కాపు మొండివెంగణపల్లి, బలిజ మొండివెంగణపల్లి, కమ్మకండ్రిగ, బ్రాహ్మణపల్లి, అనుప్పల్లి, నెమ్మలగుంటపల్లి, నూతిగుంటపల్లి మీదుగా బీరమాకుల కండ్రిగ వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా జగన్ వెదురుకుప్పంలో పార్టీ జెండాతో పాటు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.