-మేకలవారిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-ముగ్గురు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
-మృతుల్లో నాగులుప్పలపాడు తహశీల్దార్ సతీమణి
తర్లుపాడు, మేజర్న్యూస్: ప్రకాశం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తర్లుపాడు మండలం మేకలవారిపాలెం టోల్ప్లాజా సమీపంలో జాతీయ రహదారి పై రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఓ తహశీల్దార్ భార్య సహా ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
నాగులుప్పలపాడు మండలం తహసీల్దార్ బచ్చల రమణారావు సతీమణి మాధవి(35), మాధవి సోదరుడు యరగ్రొండపాలెం ఆర్డబ్లూ్యఎస్ సీనియర్ అసిస్టెంట్ గోగు రఘురాం(38)లు మార్కాపురంలో గ్రూప్-2 పరీక్షలు వ్రాసి అనంతరం తిరిగి నాగులుప్పలపాడు వెళ్లేందుకు మార్కాపురంకు చెందిన ఎ.పి 27 బిఎల్ 3344 నెంబర్ గల ఇన్నోవాలో నాగులుప్పలపాడు బయలుదేరారు. ఈ క్రమంలో తర్లుపాడు మండలం మేకలవారిపల్లె టోల్ప్లాజా సమీపంలో ఎదురుగా వస్తున్న ఎపీ27టివై 5749 బొలెరో వాహనంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలో ప్రయానిస్తున్న మాధవి, రఘురాం, బోలెరో డ్రైవర్ ఇలకోటి అంబిరెడ్డి(47) అక్కడికక్కడే మరణించారు. విషయం తెలుసుకున్న దర్శి డియస్పి వియస్ రాంబాబు, పొదిలి సిఐ శ్రీనివాసరావు, తాడివారిపల్లె ఎసై్స లక్ష్మారెడ్డి, కొనకనమిట్ల ఎసై్స బ్రహ్మనాయుడు సంఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఇన్నోవా డ్రైవర్ మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇన్నోవా డ్రైవర్ ఉత్తరాది గౌరీశంకర్ను డియస్పి రాంబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ డియస్పి కి ప్రమాద వివరాలు తెలుపుతూ మార్కాపురం నుండి ఒంగోలుకు వెళ్తున్న వాహనానికి ఎదురుగా వచ్చిన బోలెరో వాహనం వేగంగా రావడంతోనే ప్రమాదం జరిగిందిని ఆయనకు వివరించారు. మృతదేహాలను మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. మరణించిన వారిలో రెవిన్యూ, ఆర్డబ్లూ్యఎస్ సిబ్బంది ఉండడంతో డివిజన్లోని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున వైద్యశాలకు చేరుకున్నారు. తహసీల్దార్ రమణారావును మార్కాపురం, తర్లుపాడు తహసీల్దార్లు పి.ఉమారాణి, బి.చంద్రలీల, మార్కెట్ యార్డు చైర్మన్ డివి కృష్ణారెడ్డిలతో పాటు, పలువురు పరామర్శించారు.
తహశీల్దార్ కుటుంబంలో విషాదం
గ్రూప్-2 పరీక్ష రాసి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో భార్య, బావమరిది చనిపోవడంతో తహశీల్దార్ కుటుంబం తీవ్ర విషాధంలో మునిగిపోయింది. తహశీల్దార్ను పలువురు ఉన్నతాధికారులు ఫోన్లో పరామర్శించారు.