తిరుపతి, మేజర్న్యూస్ః కాపులను నమ్మించి సీఎం చంద్రబాబు నాయుడు మోసం చేశారని వైసీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్రెడ్డి మండిప డ్డారు. పథకం ప్రకారమే కాపులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇప్పుడు చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ దీక్ష కు వైసీపీ మద్దతు ఉంటుందని భూమన తెలిపారు.