కర్నూలు: నగరంలోని మెగాసిటీ పంక్షన్ హాలులో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ప్రభుత్వం కాపుల ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తోందని, ఎవరు అడ్డుకున్నా ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చినమాట ప్రకారం కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ముద్రగడ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో కాపు నేతలు, కార్యకర్తలు సత్యాగ్రహదీక్షలు చేపట్టారు.