ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుబాయ్‌లో క్రికెటర్‌ గబ్బర్‌కు అవమానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2017, 03:38 PM

కేప్‌టౌన్‌: భారత క్రికెటర్‌ శిఖర్‌ధావన్‌కు దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది. సతీమణి ఆయేషాతో పాటు ఇద్దరు పిల్లలతో కలిసి ధావన్‌ బుధవారం దక్షిణాఫ్రికా బయల్దేరాడు. ముంబయి నుంచి దుబాయ్‌ చేరుకుని అక్కడి నుంచి మరో విమానంలో వీరు దక్షిణాఫ్రికా వెళ్లాల్సి ఉంది. దుబాయ్‌లో దక్షిణాఫ్రికా విమానం ఎక్కే సమయంలో సంబంధిత విమాన సిబ్బంది ధావన్‌ భార్యతో పాటు పిల్లలను ఎక్కించుకునేందుకు అనుమతించలేదట. పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలను చూపించాలని అడిగారట. దీంతో వారు ఇప్పటికీ దుబాయ్‌ ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయారట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com