ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ-విశాఖ మధ్య పలు రైళ్ల రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2017, 10:14 AM

హైదరాబాద్ : తాడి- దువ్వాడ రైల్వేస్టేషన్‌ల మధ్య ట్రాక్‌ మరమ్మతుల కారణంగా విజయవాడ- విశాఖ మధ్య పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో అధికారి ఉమాశంకర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు 67295 రాజమండ్రి - రవికంపాడు మధ్య నడిచే రైలును 29, 31 రోజుల్లో రద్దు చేశారు. అదే విధంగా రైలు నెంబరు 67247 రవికంపాడు- విశాఖపట్నంల మధ్య నడిచే రైళ్లు 29, 31 రెండు రోజులు రద్దు చేశారు. రైలు నెంబరు 57255 కాకినాడ పోర్టు -విశాఖపట్నం (అనకాపల్లి- విశాఖపట్నం) రైల్వేస్టేషన్‌ల మధ్య నడిచే ప్యాసింజర్‌ రైళ్లు 29, 31 రెండు రోజులలో పాక్షికంగా రద్దు చేయగా.. విశాఖపట్నం -కాకినాడ పోర్టుల మధ్య నడిచే ప్యాసింజర్‌ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com