తిరుమల,సూర్యప్రతినిధి: తిరుమలలో భద్రతా డొల్లతనం మరోసారి బయటపడింది. ఓ మహిళ శ్రీవారి ఆలయంలోకి సెల్ఫోన్తో ప్రవేశించింది. దర్శనం తర్వాత బయటకు వచ్చే సమయంలో భద్రతా సిబ్బంది ఆ విషయాన్ని గుర్తించారు. ఆమె దగ్గర నుంచి విజిలెన్స్ అధికారులు ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ లోపు అధికారులు మూడు సార్లు తనిఖీలు నిర్వహిస్తారు. అయినప్పటికి భక్తురాలు సిబ్బంది కళ్లు కప్పి సెల్ఫోన్తో ఆలయంలోకి ప్రవేశించింది. భద్రతా సిబ్బంది వైఫల్యంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.