ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల భద్రత సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 02:17 AM

తిరుమల,సూర్యప్రతినిధి: తిరుమలలో భద్రతా డొల్లతనం మరోసారి బయటపడింది. ఓ మహిళ శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్‌తో ప్రవేశించింది. దర్శనం తర్వాత బయటకు వచ్చే సమయంలో భద్రతా సిబ్బంది ఆ విషయాన్ని గుర్తించారు. ఆమె దగ్గర నుంచి విజిలెన్స్‌ అధికారులు ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఈ లోపు అధికారులు మూడు సార్లు తనిఖీలు నిర్వహిస్తారు. అయినప్పటికి భక్తురాలు సిబ్బంది కళ్లు కప్పి సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి ప్రవేశించింది. భద్రతా సిబ్బంది వైఫల్యంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com