ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు అందరి బాధ్యత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 01:26 AM

-పట్టభద్రులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
-ఉపాధ్యాయులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన ఘనత టీడీపీదే
-దొనకొండలో పరిశ్రమల ఏర్పాటుతో వే మందికి ఉపాధి అవకాశాలు
-విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రులు శిద్ధా, రావెల 


  దర్శి, మేజర్‌న్యూస్‌ : తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానా లకు టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్ధులను గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శని వారం మంత్రులు శిద్ధా రాఘవరావు, రావెల కిషోర్‌బాబులు  దర్శి, సంత నూతలపాడు, చీమకుర్తిలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సభల్లో వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో  పట్టభద్రుల అభ్యర్థి గా  పట్టాభి రామిరెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్ధిగా వాసుదేవ నాయుడును ఎన్నిక చేయడం జరిగిందన్నారు. ఈ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉందన్నారు. పట్టభద్రులతోపాటు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్క రించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు.  ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందిలో ఉన్నప్పటికి ఉపాధ్యాయులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ అందించడం జరిగిందన్నారు. రెండున్నర సంవత్సరం అధికారంలో  ఎన్నో సంక్షేమ పథకా లను  ప్రవేశపెట్టి  అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. 1600 కోట్ల అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని, ఆ ఘనత ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.  అన్ని విషయాల్లో  ముందుండడం టిడిపి ఆలోచనా సరళికే నిదర్శనమన్నారు. రాష్ట్రం అభివృద్దిలో వేగంగా దూసుకుపోతుందన్నారు.  గతంలో  రోడ్లలన్నీ గుంతలమయంగా ఉండేవని తాను మంత్రిగా అధికా రం చేపట్టిన నాటి నుండి  రోడ్లు అద్దాలు లాగా తయారు చేసి, ప్రయాణ సౌలభ్యం  సులభతరం చేసినట్లు మంత్రి శిద్ధా రాఘవ రావు వెల్లడించారు. దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌గా  అభివృద్ధి చేస్తున్నా మని  తద్వారా  యువతకు ఉద్యోగ అవకాశాలు  కల్పించడం జరుగుతుం దన్నారు. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి  విద్య, వైద్య,  ఆరోగ్య రంగా లలో  ఎన్న డూ లేనివిధంగా ప్రజలకు చేరువ య్యేటట్లు చేసిన ఘనత టిడిపికే దక్కుతుంద న్నారు.  దర్శి ప్రాంతాన్ని అధికారం చేపట్టిన అనంతరం  అభివృద్ది అంటే తెలిసే విధంగా అభివృద్ది చేశామన్నారు. అంతర్జాతీయ డ్రైవిం గ్‌ స్కూల్‌  ఏర్పాటు చేయడం గొప్పవిషయంగా అభివర్ణించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం టిడిపి పని తనానికి ఒక నిదర్శనమని అన్నారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్క రణలు ప్రవేశపెట్టి పేద విద్యార్థులు కూడా విదేశాలలో చదువుకునే విధంగా అవకా శాలు కల్పించిన ఘనత మన ప్రభుత్వానిదేనన్నారు.
ఇన్‌చార్జి మంత్రి, సాంఘీక సంక్షేమ శామంత్రి రావెల కిషోర్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి  నిధులను కేటాయించడమే కాకుండా  వారికి అందే విధంగా  చర్యలు తీసుకుంటున్న ఘనత మన ప్రభుత్వందేనన్నారు. పేద విద్యార్థులకు  స్కాలర్‌షిప్‌లు అందించి విద్యాభివృద్దికి తోడ్పడడం జరిగింద న్నారు. టిడిపి బలపరచిన అభ్యర్థులను గెలిపించి  అధికారంలో ఉన్న ప్రభు త్వం ద్వారా లబ్దిపొందాలని, పట్టభద్రులు, ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్‌ సూరె చిన సుబ్బా రావు,  మండల టిడిపి అధ్యక్షులు గొర్రె సుబ్బారెడ్డి,  ఎంపిపి పూసల సంజీవ య్య,  వైస్‌ఎంపిపి మారం శ్రీనివాసరెడ్డి, జడ్పిటిసి స్టీవెన్‌, తెలుగు యువత నాయకులు పూసల పవన్‌బాబు, చిన్న,  యనమల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి గౌతమి స్కూల్‌ కరస్పాండెంట్‌ రాజకేశవరెడ్డి అధ్యక్షత వహించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com