అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్రెడ్డి 38వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. ఉదయం ధర్మవరం నియోజకవర్గం దర్శనమల నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర నడిమిగడ్డపల్లి క్రాస్ మీదుగా బిల్వంపల్లికి చేరుకుంది. పాదయాత్రలో ఉన్న జగన్కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. జగన్కు గ్రామ సమస్యలపై ప్రజలు విన్నవించారు. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జగన్ ముందుకు వెళుతున్నారు.