లక్నో : గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గుజరాత్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నెలకొంది. అయితే గుజరాత్, హిమాచల్ప్రదేశ్ రాష్ర్టాల్లో బీజేపీ గెలువాలని కోరుతూ.. ఆ పార్టీ మద్దతుదారులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వారణాసిలో బీజేపీ కార్యకర్తలు హోమం చేపట్టారు. ఈ రెండు రాష్ర్టాల్లోనూ బీజేపీనే తప్పక గెలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.