అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 38వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 38వ రోజు పాదయాత్రను ధర్మవరం నియోజకవర్గం దర్శనమల నుంచి ప్రారంభించారు. పాదయాత్ర నడిమిగడ్డపల్లి క్రాస్, బిల్వంపల్లి, నేలకోట, నేలకోటతండా, బుడ్డారెడ్డిపల్లి, ఏలుకుంట్ల మీదుగా తనకంటివారిపల్లి వరకు కొనసాగనుంది.