అహ్మదాబాద్ : గుజరాత్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ముందంజలో ఉన్నారు. బీజేపీ 29, కాంగ్రెస్ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గుజరాత్లో బీజేపీ గెలుపు ఖాయమని పార్టీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అదే స్థాయిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు గంటల్లో పార్టీల భవితవ్యం పూర్తి స్థాయిలో తేలనుంది.