గుజరాత్ : ఇవాళ ఉదయం 8 గంటలకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. గుజరాత్లోని మొత్తం 33 జిల్లాల్లో 37 కేంద్రాల్లో, హిమాచల్ ప్రదేశ్లోని 42 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు సాగనున్నది. గుజరాత్లో మొత్తం182 స్థానాల నుంచి 1,828 మంది పోటీ చేశారు. గుజరాత్ లో అధికారం దక్కాలంటే కనీసం 92 స్థానాల్లో గెలుపు తప్పనిసరి. అదేవిధంగా హిమాచల్ప్రదేశ్లోని 68 అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగనున్నది. 68స్థానాల్లో 337 మంది అభ్యర్థులు పోటీ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటుకు 35 స్థానాల్లో గెలుపు తప్పనిసరి.