ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేసీఆర్ పిలవలేదని చంద్రబాబు ఏమన్నారో తెలుసా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2017, 02:36 PM

డిసెంబర్ 16న తెలంగాణలో కేసీఆర్ అట్టహాసంగా నిర్వహించిన తెలుగు మహాసభలకు సాటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆహ్వానం అందలేదు. మొదటినుంచి బాబును పిలుస్తారనే భావించినా, చివరకు ఆయనకు మొండిచెయ్యే ఎదురైంది.


మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో మూడు రోజులుగా దళిత నేతలకు జరుగుతున్న శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియా ప్రతినిధులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలుగు మహాసభలకు మిమ్మల్ని పిలవలేదు కదా..మీరు ఏమనుకుంటున్నారు అని ఒక విలేకరి వేసిన ప్రశ్నకు చంద్రబాబు సమాధానమిచ్చారు.”నన్ను పిలవకపోయినా ఫర్వాలేదు. తెలుగువారం ఎక్కడ ఉన్నా మన భాషను గౌరవించుకోవాలి. భాషను కాపాడుకోవాలి. తెలుగు మహాసభలు ఎక్కడ జరిగినా తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతుంది. తెలుగువారంతా కలిసి ఉండాలన్నది మా ఆకాంక్ష. ఎవరు ఎక్కడ ఉన్నా మనమంతా తెలుగు వారమన్న స్ఫూర్తి పోకూడదు” అని చంద్రబాబు ఆన్సర్ ఇచ్చారు.


ఇక గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని తీసుకురావడం, తమ ప్రభుత్వం సాధించబోయే విజయాల్లో మొదటిది మాత్రమేనని, మున్ముందు మరిన్ని పెద్ద కంపెనీల పెట్టుబడులు ఏపీకి రాబోతున్నాయని బాబు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com