విశాఖను విద్యా హబ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖలో జరుగుతున్న టెక్-2017 సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూౌ ఆన్లైన్ సేవల ద్వారా పౌర సౌకర్యాలు మెరుగు పరుస్తున్నామన్నారు. సచివాలయం నుంచి గ్రామస్థాయి వరకు కాగిత రహిత పాలనకు అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. అన్నింటా పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.