ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ తలకి తుపాకీ గురి పెట్టాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2017, 01:02 PM

చింద్వారా: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభ ఎంపీ కమల్‌నాథ్‌ తలకు తుపాకీ గురిపెట్టాడు. దిల్లీ విమానం ఎక్కేందుకు చింద్వారా విమానాశ్రయానికి శుక్రవారం సాయంత్రం కమల్‌నాథ్‌ వచ్చారు. అయితే.. విమానాశ్రయంలో ఎంపీ భద్రత కోసం వచ్చిన పోలీసుల్లో ఒక కానిస్టేబుల్‌ అకస్మాత్తుగా ఆయన తలకి లోడ్‌ చేసి ఉన్న గన్‌ గురి పెట్టారు. వెంటనే గమనించిన పోలీసులు కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. సదరు కానిస్టేబుల్‌ను రత్నేష్‌ పవార్‌గా అధికారులు గుర్తించారు.


పవార్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అయితే.. అలా ఎందుకు చేశానో తెలియడం లేదని పవార్‌ చెప్పుకొస్తున్నాడు. అసలు ఆ క్షణంలో ఏం జరిగిందో తనకు ఏమీ గుర్తులేదని అంటున్నాడు. ప్రస్తుతం అతడిని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com