ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ చేరుకున్నాక విమానాశ్రయంలో అరైవల్ ఆన్ వీసా కేంద్రాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం టెక్-2017 సదస్సు వేదిక వద్దకు చంద్రబాబు చేరుకుని మానవీయత కోసం విద్య పరివర్తన అంశంపై సదస్సును ప్రారంభించారు. ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ ఫర్ హ్యుమానిటీ-2017 పేరిట సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సుకు కేంద్రమంత్రి సత్యపాల్సింగ్, మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు 75 దేశాల నుంచి 800 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నవ్యాంధ్రను గేమింగ్, యానిమేషన్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా సదస్సు జరుగుతోంది.