ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో టెక్‌-2017 సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 16, 2017, 12:30 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటిస్తున్నారు. విశాఖ చేరుకున్నాక విమానాశ్రయంలో అరైవల్‌ ఆన్‌ వీసా కేంద్రాన్ని చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం టెక్‌-2017 సదస్సు వేదిక వద్దకు చంద్రబాబు చేరుకుని మానవీయత కోసం విద్య పరివర్తన అంశంపై సదస్సును ప్రారంభించారు. ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎడ్యుకేషన్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ హ్యుమానిటీ-2017 పేరిట సదస్సు నిర్వహిస్తున్నారు. సదస్సుకు కేంద్రమంత్రి సత్యపాల్‌సింగ్‌, మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు 75 దేశాల నుంచి 800 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. నవ్యాంధ్రను గేమింగ్, యానిమేషన్ హబ్ గా మార్చడమే లక్ష్యంగా సదస్సు జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com