న్యూఢిల్లీ : బొగ్గు బ్లాక్ల కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది. మధుకోడాకు మూడేళ్ల జైలు శిక్ష, రూ. 25 లక్షలు జరిమానా విధించింది కోర్టు. మధుకోడా సహా నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ కార్యదర్శి అశోక్ బసు, మరో ప్రభుత్వ అధికారిని ఈ కేసులో కోర్టు దోషులుగా నిర్ధారించింది. నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కోర్టు వెల్లడించింది. కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్(విసుల్)కు జార్ఖండ్లోని రాజ్హరా బొగ్గు బ్లాక్ కేటాయించడానికి కోడా సహా మిగతా నిందితులు కలిసే కుట్రచేశారని సీబీఐ ప్రత్యక న్యాయస్థానం జడ్జి భరత్ పరాశర్ వెల్లడించిన విషయం తెలిసిందే.