జకర్త : ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. సిపతుజా కేంద్రంగా 6.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం వల్ల ఇద్దరు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. దేశరాజధాని జకర్తలో కూడా స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బిల్డింగ్లు కూలడం వల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూకంప కేంద్రం వద్ద నష్టం భారీగా ఉందన్నారు. శుక్రవారం రాత్రి 11.47 నిమిషాలకు భూకంపం నమోదు అయింది. సుమారు 30 సెకన్ల పాటు భూమి ఊగిపోయినట్లు నిపుణులు తెలిపారు.