శ్రీలంక జట్టు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం నోవాటెల్ హోటల్ నుంచి స్టేడియానికి నెట్ప్రాక్టీస్కు బయలుదేరిన బస్సు హోటల్ సమీపంలో గోడను ఢీకొనడంతో దానిలో ఉన్న లంక క్రికెటర్లు కలవరపాటుకు గురయ్యారు. వెంటనే డ్రైవరు తేరుకుని బస్సును సరైన దిశలో నడపడంతో అంతా సర్దుకుంది. లంక క్రికెటర్లు యథావిధిగా స్టేడియంలో నెట్పాక్ట్రీసు చేసుకుని తిరిగి హోటల్కు చేరుకున్నారు.
ఈనెల 17వ తేదీ ఆదివారం నాడు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మూడో వన్డే మ్యాచ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు మ్యాచ్ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, పోర్టు ఛైర్మన్ ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన నిర్వహణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ భద్రత, పార్కింగ్, టిక్కెట్ల విక్రయాలు, పారిశుద్ధ్యం, రవాణా తదితర అంశాలపై చర్చించారు. టిక్కెట్లు శుక్రవారం మధ్యాహ్నానికి 70 శాతం ఆన్లైన్లో అమ్ముడైనట్లు ఏసీఏ కార్యదర్శి అరుణ్కుమార్ తెలిపారు. శనివారానికల్లా మిగతా టిక్కెట్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని నిర్వహణ కమిటీ సభ్యులు చెప్పారు. సమావేశంలో కలెక్టరు ప్రవీణ్కుమార్, జేసీ సృజన, డీసీపీ ఫకీరప్ప పాల్గొన్నారు.