అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాగ్నమ్ పైరెక్స్ సీఈవో హుబెర్ట్ మాన్షేర్ భేటీ అయ్యారు. జర్మనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ మాగ్నమ్ పైరెక్స్ సంస్థ సీఈవో చంద్రబాబుతో సమావేశమయ్యారు. తక్కువ వ్యయంతో ఎక్కువ దూరం ప్రయాణించే కార్ల తయారీపై హుబెర్ట్ మాన్షేర్ సీఎం చంద్రబాబుకు వివరించారు. అమరావతిలో కార్ల పరిశ్రమ ఏర్పాటుకు మాగ్నమ్ పైరెక్స్ సంస్థ ఆసక్తి కనబరుస్తోంది. సమగ్ర ప్రతిపాదనలతో రావాలని మాగ్నమ్ పైరెక్స్ సీఈవో హుబెర్ట్ మాన్షేర్ కు చంద్రబాబు సూచించారు.