పార్లమెంటులో ఉప రాష్ర్టపతి వెంకయ్యను కేంద్రమంత్రి గడ్కరీ కలిశారు. పోలవరం ప్రాజెక్టుపై ఎలాంటి అనుమానాలు లేవని, 2019 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు. చిన్న చిన్న అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తున్నామని, కేంద్రమంత్రిగా నేనే స్వయంగా పర్యవేక్షిస్తానని, 15 రోజులకోసారి పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్తానని చెప్పారు. నిధులు, అనుమతుల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవన్న గడ్కరీ.. ఎట్టిపరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు.