న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ రాజకీయాలకు గుడ్బై చెప్పారు. క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఇవాళ ప్రకటించారు. 19 ఏళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా బాధ్యతలు నిర్వహించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా అత్యధిక కాలం సేవలందించి యువ నాయకత్వానికి అవకాశమివ్వాలని భావించిన ఆమె రాజకీయాల నుంచి పూర్తిగా వెదొలగుతున్నట్లు ప్రకటన చేశారు. గత కొద్ది రోజుల నుంచి సోనియాకు ఆరోగ్యం సహకరించని విషయం తెలిసిందే.