అమెరికాలోని కాన్సస్లో తెలుగు ఇంజనీర్ శ్రీనివాస్ కూఛిబొట్లను ఉన్మాది కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమాధానం చెప్పాల్సిందేనని శ్రీనివాస్ భార్య సునయన మీడియా ద్వారా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. తన భర్త హత్యకు ట్రంప్ వ్యాప్తి చేస్తున్న విద్వేషమే కారణమని చెప్పిందామె. తాజాగా హీరో సిద్ధార్థ్ కూడా ఆమె మాటలకు మద్దతు తెలిపాడు. ట్విట్టర్ ద్వారా ట్రంప్పై మండిపడ్డాడు. ఈ ఘటనను చూసి షాకవ్వొద్దని, కోపం వచ్చిందని, ట్రంప్ విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాడని, ఇది ముమ్మాటికీ జాత్యాహంకార నేరమేనని ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీనివాస్ కూఛిబొట్లకు సంతాపం ప్రకటించాడు సిద్ధార్థ్.