చిలుకలూరిపేట: రైతులను అన్ని రకాలుగా ఆదుకోవడానికి సీఎం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఇవాళ చిలుకలూరిపేట పాత మార్కెట్ యార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. షాపింగ్ కాంప్లెక్స్, 2వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను టీడీపీ ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని, రైతులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.