న్యూఢిల్లీ: శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. జాతి పురోగతిలో శీతాకాల సమావేశాలు దోహదపడుతాయని ఆశిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. అఖిల పక్ష పార్టీ సమావేశాల్లో నిర్ణయించినట్లుగా.. దేశాభివృద్ధి గురించి సమావేశాల్లో చర్చించాలన్నారు. చాలా పాజిటివ్ దృక్పథంతో చర్చలు సాగాలన్నారు. నిర్మాణాత్మక చర్చల ద్వారా జాతి సమస్యలకు పరిష్కారాలు వెతకాలని మోదీ సూచించారు. సాధారణంగా దీపావళి నుంచి శీతాకాలం ప్రారంభం అవుతుందని, కానీ గ్లోబల్ వార్నింగ్ వల్ల శీతాకాలం పూర్తిగా రాలేకపోయిందని, కానీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయని, సభలో జరిగే చర్చల ద్వారా లాభం చేకూరుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.