విశాఖ రైల్వే జోన్ పై మరో బాంబ్ పేలింది. రైల్వే జోన్ ఏర్పాటుపై తమ వద్ద ప్రతిపాదన లేవీ పెండింగ్ లో లేవని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహానీ తెలిపారు. రైల్వే జోన్ పై పరిశీలనా గానీ, కదలికా గానీ లేదని ఆయన తెలిపారు. కేంద్రం రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప రైల్వే జోన్ సాధ్యం కాదని అన్నారు. మరోవైపు రైల్వే జోన్ వచ్చినా ఒరిగేదేమీ లేదని రైల్వే కార్మిక సంఘాలు వెల్లడించాయి.