న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేగింది. ఢిల్లీలోని ఖాన్ మార్కెట్లో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ ద్వారా పోలీసులకు చెప్పారు. సాయంత్రం 4 గంటలకు బాంబు పేలుతుందని అగంతకులు హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, డాగ్ స్కాడ్ సిబ్బంది ఖాన్ మార్కెట్కు చేరుకుని తనిఖీలు చేపట్టింది. మార్కెట్ను విస్తృతంగా తనిఖీలు చేసిన డాగ్ స్కాడ్, బాంబు స్కాడ్.. అక్కడ బాంబు లేదని తేల్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి.