ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలింగ్‌ సమయంలో రోడ్‌ షో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2017, 09:19 AM

ఓటర్లు, మీడియా సాక్షిగా ప్రధాని మోడీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారు. పోలింగ్‌ జరుగుతుండగానే ఆయన రోడ్‌ షో నిర్వహించారు. ప్రధాని నిర్వహించిన ఈ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు, పరిశీలకులు ప్రధానిని తప్పు పట్టారు. వెల్లువెత్తుతున్న ఈ విమర్శలపై ప్రధాని మోడీ పెదవి విప్పలేదు. అహ్మదాబాద్‌ నియోజకవర్గంలో ప్రధాని మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం సిరా పూసిన తన వేలుని చూపుతూ ఆయన100 మీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. ఆ తరువాత ఓపెన్‌టాప్‌ జీపులో నిలబడి ఆయన రోడ్‌షోను కొనసాగించారు. ఓటర్లు గుంపులుగుంపులుగా ఉన్నంత దూరం ఈ ప్రదర్శన కొనసాగింది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడం గతంలో ఎన్నడూ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


ఈ రోడ్డుషోపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. అయితే ఈ వ్యాఖ్యలను బిజెపి తిప్పికొట్టింది. ఓడిపోతున్నామనే బాధలోనే ఇసిపై కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి బిజెపి, కాంగ్రెస్‌ నేతలు పోటెత్తారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బిజెపి నేతలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు కార్యాలయం ముందు నినాదాలు చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com