సింహాద్రిపురం: కడప జిల్లా సింహాద్రిపురంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలో పదోతరగతి చదువుతున్న వెంకటేశ్వరి అనే విద్యార్థిని ఉరేసుకుని మృతి చెందింది. మృతురాలిది లింగాల మండలం దిగువపల్లి గ్రామం. ఆరోతరగతి నుంచి ఇదే పాఠశాలలో చదువుతోంది. బుధవారం రాత్రి తోటి విద్యార్థినులతో భోజనం చేసి పడుకున్న వెంకటేశ్వరి అర్థరాత్రి తర్వాత పై అంతస్థుకు వెళ్లి ఉరి వేసుకుంది. మృతికి కారణాలు తెలియరాలేదు. ఎస్సై సంజీవరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు వసతిగృహానికి చేరుకుని ఆరా తీశారు.