ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఊహాలోకం నుంచి చంద్రబాబు బయటకు రావాలి: సుధాకర్‌బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2017, 12:20 PM

విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊహాలోకం నుంచి బయటకు రావాలని వైసీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని విషయంలో చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఆరోపించారు. రాజధానిలో ప్రపంచ స్థాయి నిర్మాణాలంటూ రోజుకో గ్రాఫిక్‌ చూపిస్తున్నారన్నారు. రూ.500 కోట్లు ఖర్చు పెట్టి 23 దేశాలు తిరిగారని, చివరకు డిజైన్ల కోసం దర్శకుడు రాజమౌళిని ఆశ్రయించారన్నారు. రాజమౌళి సలహాలు తీసుకున్నా పర్వాలేదు కానీ రాజధానిని సినిమా చేయకండి అని హితవుపలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com