విజయవాడ: అమరావతిని ఆనందమయ నగరంగా తీర్చిదిద్దటమే మా లక్ష్యమని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. ఇవాళ విజయవాడలో అమరావతి డీప్ డైవ్ పేరిట నిర్వహించిన వర్క్షాప్లో సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ అమరావతి ప్రయాణం 1,080 రోజులకు చేరుకుందన్నారు. ప్రతిక్షణం, ప్రతి రోజు రూపును మార్చుకుంటూ నిర్మితమవుతోందని, ఆకృతుల్లో చూపినట్లు అమరావతి కనిపించడానికి ఎంతో సమయం పట్టదని పేర్కొన్నారు. సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు 59వేల ప్లాట్స్ తిరిగిచ్చామన్నారు. 35 నెలల్లో 50శాతం నిర్మాణ లక్ష్యాలను చేరుకున్నామని త్వరలోనే అమరావతి పూర్తిగా నిర్మితమవుతోందని వివరించారు.