ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరిత, నీలి నగరంగా అమరావతి: అజయ్‌జైన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2017, 11:41 AM

హరిత, నీలి నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌ జైన్‌ తెలిపారు. ఇవాళ విజయవాడలో అమరావతి డీప్‌ డైవ్‌ పేరిట వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్‌జైన్‌ మాట్లాడుతూ రాష్ట్రానికే కాదు దేశానికే ఒక బ్రాండ్‌గా రాజధానిని నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ముంబాయి, బెంగుళూరు, ఢిల్లీ వంటి వాటితో పోటీపడుతూ ఆధునిక నగరాన్ని నిర్మిస్తున్నామని, ఇప్పటికే రూ.20వేల కోట్ల విలువైన పనులు అమరావతిలో జరుగుతున్నాయన్నారు. ఐకానిక్‌ భవనాలు నిర్మించాలన్నది మా కల అని, నార్మన్‌ ఫోస్టర్‌ వంటి ప్రముఖ ఆర్కిటెక్ట్‌తో భవనాలను ప్రణాళిక చేయించామని పేర్కొన్నారు. అద్భుతమైన భవనాలు ఉన్నప్పుడే ప్రజలు వాటిని చూసేందుకు వస్తారన్నారు. ఒక్క రోజులో ఏ నగరమూ నిర్మాణం కాలేదని, అమరావతిని మరో నయా రాయ్‌పూర్‌ చేయదలచుకోలేదని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com