అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ఓటింగ్ నేడు జరుగుతోంది. ఉదయం పది గంటల వరకూ 13 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడత పోలింగ్ లో రాష్ట్రంలోని93 నియోజకవర్గాల్లో 182 స్థానాలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. 93 నియోజకవర్గాల్లో 851 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.22 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 18న ఓట్ల లెక్కింపు ఉంటుంది