ముంబై: నౌకాదళంలో కల్వరీ స్కార్పీన్ జలాంతర్గామి చేరింది. ముంబైలో కల్వరీ స్కార్పీన్ జలంతర్గామిని నౌకాదళంలో ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రవేశపెట్టారు. ఫ్రాన్స్ నౌకానిర్మాణ సంస్థ సహకారంతో ఐఎన్ఎస్ కల్వరి నిర్మాణించారు. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జలాంతర్గామి నౌకాదళంలో చేరింది. కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.