గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుదివిడత పోలింగ్ జరుగుతోంది. చలిని కూడా లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ ల వద్ద క్యూకడుతున్నారు. ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 97 సంవత్సరాల హీరాబెన్ మోడీ పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే గాంధీనగర్ లోని పోలింగ్ బూత్ కు వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు.