ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏపీ డీజీపీ సాంబ శివరావు తెలిపారు. మీడియాతో డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏటా 25వేల మంది ప్రమాదాల వల్ల మరణిస్తున్నారన్నారు. ప్రమాద జోన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బ్లాక్స్పాట్ల వద్ద ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.