అమరావతి : ఎన్నికల హామీని నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఎంపీ హరిబాబు అన్నారు. సీఎం చంద్రబాబునాయుడుతో బీజేపీ నేతల భేటీ ముగిసింది. పోలవరంపై ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈనెల 19,20 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని బీజేపీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. రెండు నెలలకోసారి రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించాలని నిర్ణయించారు. విశాఖ రైల్వేజోన్ పై ఈ సమావేశాల్లోనే నిర్ణయం ప్రకటించి ఎన్నికల హామీని నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని హరిబాబు తెలిపారు.