కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్ న్యాయమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అన్నారు. పాదయాత్రలో ఉన్న జగన్ కక్కలపల్లి క్రాస్ వద్ద ఏపీ జెన్కో, ట్రాన్స్కో కాంట్రాక్ట్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించారు. 2008లో నాన్న హయాంలో 7,114 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారన్నారు. మిగతావారిని రెగ్యులరైజ్ చేసే క్రమంలో నాన్న మనకు దూరయ్యారన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మనందరి ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని రెగ్యూలరైజ్ చేస్తామన్నారు.