అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 34వ రోజు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఉదయం అనంతపురం రూరల్ పాపంపేట బైపాస్ నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర రుద్రంపేట, సవేరా హాస్పటల్ క్రాస్ మీదుగా కక్కాలపల్లి క్రాస్ వరకు చేరుకుంది. పాదయాత్రలో జగన్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. జగన్కు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కలిసి తమ సమస్యను విన్నవించారు.